Thursday, April 18, 2024

శుభోద‌యం డిసెంబ‌ర్ 15కు వాయిదా : ఎమ్మెల్యే యాదయ్య

వికారాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శుభోదయం కార్యక్రమాన్ని డిసెంబర్ 15 వరకూ వాయిదా వేసినట్టు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ శుభోదయం కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. అనంతరం తిరిగి శుభోదయం కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని, ఇప్పటికే దాదాపు 50 గ్రామాల్లో శుభోదయం పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement