Thursday, April 25, 2024

కారు ఢీకొట్ట‌డంతో బాలిక మృతి.. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఘ‌ట‌న‌

తిమ్మాపూర్, (ప్రభ న్యూస్) : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని స్టేజీ వద్ద తీవ్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది.. తిమ్మాపూర్ కి చెందిన లోహిని శివాని తిమ్మాపూర్ స్టేజీ వద్ద రోడ్డు పక్కన నిల్చుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారు అతి వేగంగా శివానిని ఢీకొట్టడంతో కొంతదూరంలో ఎగిరిపడింది.

ఘటనా వివ‌రాలు తెలుసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆస్ప్ర‌త్రికి తరలిస్తుండ‌గా మార్గ మ‌ధ్య‌లోనే చ‌నిపోయిందని అంబులెన్స్ అధికారులు తెలిపారు. బాలికను ఢీకొట్టిన డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఎల్ఎండీ ఎస్సై ప్రమోద్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement