Friday, March 29, 2024

హైదరాబాద్ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు

రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా హైదరాబాద్ అభివృద్ధికి రూ.5 వేల కోట్ల పైగా నిధులు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కి, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కి జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయ లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నగరానికి రానున్న 15 ఏళ్ల ను కూడా దృష్టిలో పెట్టు కొని 3866 కోట్లు మంజూరు చేయడం హర్షించ దగ్గ విషయమని అన్నారు. హైదరాబాద్ ప్రజలు అన్ని పార్టీల కార్పొరేటర్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మేయర్… కేసిఆర్, కేటీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. హైదరాబాద్ శివారు నగర ప్రాంతంలో కూడా త్రాగు నీరు అందించేందుకు 1200 కోట్ల రూపాయలను మంజూరు చేయడం సాహిస పూరిత నిర్ణయమని మేయర్ అన్నారు. హైదరాబాద్ నగరం ఓఅర్అర్ లోపలి భాగంలో ఉన్న మున్సిపాలిటీల్లో నగర పాలక సంస్థ ప్రజల త్రాగు నీటి సమస్యను పరిష్కారానికి కృషి చేసిన మంత్రి కేటీఆర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు మేయర్ గద్వాల విజయ లక్ష్మి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement