Tuesday, April 16, 2024

అర‌బిందో ఫార్మా ప‌రిశ్ర‌మ‌లో గ్యాస్ లీక్… అప‌స్మార‌క‌స్థితిలో కార్మికులు

అర‌బిందో ఫార్మా ప‌రిశ్ర‌మ‌లో గ్యాస్ లీక్ అయింది. దాంతో ఈ గ్యాస్‌ను పీల్చిన న‌లుగురు కార్మికులు అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఫార్మా కంపెనీ యాజ‌మాన్యం.. ఆ న‌లుగురు కార్మికుల‌ను ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రిలో చేర్పించారు. కార్మికుల‌కు చికిత్స కొన‌సాగుతోంది. న‌లుగురు కార్మికులు అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోవ‌డంతో మిగ‌తా కార్మికులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ బాచుప‌ల్లి అరంబిదో ఫార్మా ప‌రిశ్ర‌మ‌లో చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement