Thursday, March 28, 2024

బ‌స్ బుక్ చేసుకుంటే ఐదురికి ఉచిత ప్ర‌యాణం

ప్రభ‌న్యూస్ : శబరిమలకు వెళ్ళే అయ్యప్ప భక్తులు ఆర్టీసీ బస్సును బుక్‌ చేసుకుంటే ఐదుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ ప్రకటించింది. ఈ మేరకు డిపోలలో ప్రచారాన్ని ప్రారంభించారు. శబరిమలకు బస్‌ బుక్‌ చేసుకుంటే భక్తులతో పాటు వంట మనుషులు, అటెండర్‌, పదేళ్ళలోపు ఇద్దరు మణికంఠ భక్తులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

అయితే ఈ ఐదుగురికి ప్రత్యేక సీట్లను మాత్రం కేటాయించరు. బస్సులో ఖాళీగా ఉన్న స్థలంలోనే వారు కూర్చోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. సాధారణంగా అద్దెకు ఇచ్చే బస్సులలో ఎంత మంది ఉంటే అంతమందికి సంబంధించిన ఫుల్‌ చార్జీని వసూలు చేస్తారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఈ దఫా ఐదుగురికి ఉచితంగా రవాణా కల్పించాలని నిర్ణయించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement