Thursday, April 25, 2024

మంత్రి సబితపై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఫైర్

తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై టీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. మీర్‌పేట్‌ను నాశనం చేస్తున్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబితా భూ కబ్జాలను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. చెరువులను, స్కూల్‌ స్థలాలను కూడా వదలడం లేదన్నారు. వీటిపై అవసరమైతే ఆమరణ దీక్ష కూడా చేస్తానన్నారు. మీర్ పేట్ ను నాశనం చేస్తుంటే చూస్తూ.. ఊరుకోనన్నారు. భూకబ్జాలు చేస్తే ప్రభుత్వం ఉపేక్షిందన్నారు. భూకబ్జాలు చేసే వారిపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటారన్నారు. ఈ విషయాలపై త్వరలోనే సీఎం కేసీఆర్‌ని కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్తానని తీగల కృష్ణారెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement