Saturday, April 13, 2024

వ్యాసరచన పోటీల్లో సునీత మోహ‌న్ కు ప్రథమ బహుమతి

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కరీంనగర్ పీటీసీ ప్రిన్సిపల్ సునితా మోహన్ రాష్ట్రస్థాయి ప్రథమ బహుమతి సాధించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుండి గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రథమ బహుమతితో పాటు రూ.20 వేల నగదును సునీత మోహన్ కు అందించనున్నారు.

2019 నవంబర్ 7న కరీంనగర్ పీటీసీ ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దక్షిణాది రాష్ట్రాల్లో కరీంనగర్ పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఉత్తమ పోలీస్ శిక్షణ కేంద్రంగా ఎంపిక చేసిన విషయం విదితమే. రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన సునీత మోహన్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ చంద్రమోహన్ లు అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement