Friday, April 19, 2024

Fire – హజ్రత్ నిజాముద్దీన్ రైలుకు త‌ప్పిన ప్ర‌మాదం …

మ‌హ‌బూబాబాద్ – హజ్రత్ నిజాముద్దీన్ నుండి త్రివేండ్రం వెళ్ళుతున్న స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపూరం వద్ద రైలు బోగీలో పొగలు వచ్చాయి. దీంతో వెంట‌నే రైలును అక్క‌డే నిలిపివేశారు..బోగి నుండి పొగలు రావడంతో భయాందోళన చెందిన ప్రయాణికులు రైలు దిగారు. ట్రైన్ లో నుండి దిగిన ప్రయాణికులు..రైల్వే ట్రాక్ వెంట సమీప గార్ల రైల్వే స్టేషన్ వరకు కాలిబాటన వెళ్లారు.రైల్వే అధికారులు సమాచారం అందివ్వగా..ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీంతో సుమారు 30 నిమిషాల పాటు ట్రైన్ నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అరగంట పాటు రిపేర్ చేసిన అనంతరం రైతు తిరిగి బయలుదేరింది

Advertisement

తాజా వార్తలు

Advertisement