Thursday, April 25, 2024

నర్సంపేట ఏజెన్సీలో అగ్ని ప్రమాదం.. అగ్ని కీలల్లో పూర్తిగా కాలిపోయిన నాలుగు ఇండ్లు

వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అత్యంత మరుమూల ప్రాంతం ఏజెన్సీ గ్రామం కొండాపూర్ పరిధిలోని మురళినగర్ తండాలో కొద్దిసేపటి క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు ఇండ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. మరో రెండు ఇండ్లకు పాక్షికంగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భరోసా ఇచ్చారు.

తక్షణ సాయంగా వారికి 40 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి ఆదుకున్నారు. ఈ సందర్భంగా నర్సంపేట పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సింగిరికొండ మాధవ శంకర్ సంఘం తరపున 19 వేల రూపాయలను అందించారు. జరిగిన నష్టాన్ని అధికారులు తక్షణమే అంచనా వేసి, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement