Tuesday, March 26, 2024

అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌.. కర్ర‌తో కొట్ట‌డంతో త‌మ్ముడి మృతి

మంగపేట, (ప్రభ న్యూస్) : అన్నదమ్ముల మొద‌లైన గొడ‌వ త‌మ్ముడి ప్రాణాల‌మీదికి తెచ్చింది. కోపం ప‌ట్ట‌లేక అన్న త‌న త‌మ్ముడిని కొట్టడంతో అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో బుధవారం రాత్రి జరిగింది. కమలాపురంలోని అల్లూరి సీతారామరాజు వీధి (చెరువు కట్ట ఏరియా)కి చెందిన మునుకుంట్ల సంపత్, మునుకుంట్ల శేఖర్ ఇద్దరు అన్నదమ్ములు. నిన్న (బుధవారం) రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.

అది కాస్తా ముదరడడంతో కోపోద్రికుడైన అన్న మునుకుంట్ల సంపత్ త‌న తమ్ముడు శేఖర్ ముఖంపై కర్రతో గ‌ట్టిగా కొట్టాడు. దీంతో శేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వ‌దిలేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement