Saturday, April 20, 2024

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

టేకుమట్ల, ( ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం సుబ్బక్క పల్లి గ్రామంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఈరోజు చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సుబ్బక్క పల్లి గ్రామానికి చెందిన సిద్దూరి రవీందర్రావు (52) తన సొంత భూమిలో మిర్చి సాగు చేయగా, వింత వైరస్ సోకింది. పంట నష్టం వాటిల్లిందని, అప్పులు పెరిగేలా ఉన్నాయని మనస్థాపానికి గురైన రైతు తన మిరప తోటకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. మృతుడి భార్య సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement