Thursday, April 25, 2024

ములుగు జిల్లాలో రైతు ఆత్మ‌హ‌త్య‌.. పెద్ద బిడ్డ పెళ్లి చేద్దాం అనుకుంటే దెబ్బ‌తీసిన మిర్చీ..

ఏటూరునాగారం, (ప్రభ న్యూస్): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక గ్రామానికి చెందిన సొనప హనుమయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమయ్య వేసిన‌ మిర్చి పంట‌కు తెగుళ్లు సోకి పంట న‌ష్టం జ‌రిగింది. పంట‌ సేద్యానికి రూ.2లక్షల దాకా పెట్టుబడి పెట్టాడు. తెగుళ్లు సోక‌డంతో మిర్చి ఎదుగుదల ఆగిపోయిందని, దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలనే మ‌న‌స్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

కాగా, మృతుడు హనుమయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురుకి ఈ పంట మీద వచ్చే సొమ్ముతో పెళ్లి పెళ్లి చేద్దాం అనుకున్నార‌ని అత‌ని భార్య ఆదిలక్ష్మి క‌న్నీరుమున్నీరు అవుతోంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement