Thursday, April 25, 2024

కవితతో సహా పలువురి ఫోటోల మార్ఫింగ్.. 8మంది అరెస్ట్..

సోషల్ మీడియాలో పలువురు రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు, పారిశ్రామిక రంగంలో ఉన్న ఫోటోలను మార్ఫింగ్ చేసిన కేసును పోలీసులు చేధించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే పలువురు సినీ తారలు సైతం తమ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ సైబర్ సెల్ కు విన్నవించారు.

దీంతో సైబర్ సెల్ డీసీపీ స్నేహ మేహ్ర నాయకత్వంలో విచారణ జరిపి ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 8మంది వ్యక్తులను నేడు అరెస్టు చేశారు. అలాగే సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలను, వీడియోలను ట్రోల్ చేస్తున్న మరో 30మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇంకా ఈకేసును దర్యాప్తు చేస్తున్నామని, విదేశాల్లో ఉన్న వారు కూడా ట్రోలింగ్ చేస్తున్నట్లు గుర్తించామని డీసీపీ వెల్లడించారు. త్వరలోనే మరికొందరిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement