Wednesday, April 24, 2024

బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులపై స్టే పొడిగింపు

ఫాం హౌస్ కేసులో బీఎల్ సంతోష్, తుషార్ లకు సిట్ జారీ చేసిన సీఆర్పీసీ 41ఏ నోటీసులపై హైకోర్టు మరో ఆరు వారాలపాటు స్టే పొడిగించింది. బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బీఎల్ సంతోష్, తుషార్ నోటీసులపై న్యాయస్థానం విచారణ చేసింది. ఈ నేపథ్యంలో స్టే పొడిగించాలని బీఎల్ సంతోష్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ మేరకు రెండు వారాలు గడువు ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు. ప్రభుత్వ అప్పీల్ పిటిషన్ పెండింగ్ లో ఉందని పీపీ తెలిపారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం ఆరు వారాల వరకు స్టే ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement