Friday, April 26, 2024

హుజూరాబాద్ ఉప ఎన్నికతో నాపై దుష్ప్ర‌చారం: మాజీ ఐపీఎస్

తర్వలో ఉప ఎన్నిక జరగనున్న హుజురాబాద్ లో దళిత బంధ సహా పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం కోట్ల రూపాయాలు విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం వెదజల్లుతోన్న‌ డబ్బును అభివృద్ధికి వినియోగించాలని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్ లో కొంద‌రికి తాను మద్దతు ఇస్తున్నట్లు తనమీద దుష్ప్రచారం జరుగుతోందని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. త‌న‌పై వ‌స్తోన్న ఈ ప్రచారాన్ని నమ్మ‌వద్దని కోరారు. అంబేద్క‌ర్ బాటలో నడిచేందుకు, ఒంటరి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, బ‌హుజ‌న, బ‌డుగు వ‌ర్గాల బాగు కోస‌మే తాను ప‌నిచేస్తాన‌ని తెలిపారు.  త‌న‌ మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి చేసే వారికే ఉంటుంద‌ని స్పష్టం చేశారు. తాను ఇప్ప‌టికే వీఆర్‌ఎస్‌ తీసుకున్నాన‌ని, ప్ర‌స్తుతం కొత్త‌ ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నానని చెప్పారు. ఈ స‌మ‌యంలో త‌న‌ను వివాదాలలోకి లాగవద్దని కోరారు. ఒక‌వేళ త‌న‌ను ఎవ‌రైనా వివాదాల్లోకి లాగితే వారి అంచనాలు తలకిందులవుతాయ‌ని ప్రవీణ్ కుమార్ హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement