Friday, March 29, 2024

ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాలి : మేయ‌ర్ నీలా గోపాల్ రెడ్డి

ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని మేయ‌ర్ కోల‌న్ నీలా గోపాల్ రెడ్డి అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేష‌న్ ప్రక్రియను మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డిలు ప‌రిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ…ప్రజలు తప్పక వాక్సిన్ వేసుకోవాల‌న్నారు. విధిగా మాస్క్ లు ధరించి, ఎప్పటికప్పుడు చేతులను సానిటైజ్ చేసుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, NMC తెరాస పార్టీ జనరల్ సెక్రెటరీ నాగరాజ్ యాదవ్, 10వ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు బైండ్ల నగేష్ పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement