Saturday, April 20, 2024

ఆ మూడు గ్రామాల్లో ఈటల రోడ్‌షో..

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇవాళ కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్‌కు వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక మొదటిసారి హుజూరాబాద్‌ ఆయన వెళ్తున్నారు.ఈ సందర్భంగా ఈటల మూడు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు. కమలాపూర్‌, శంభునిపల్లి, కానిపర్తి గ్రామాల్లో రోడ్‌ షో నిర్వహించి అనంతరం మూడు గ్రామాల ప్రజలతో ఈటల చర్చించనున్నారు. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ఫోకస్ పెడుతోంది. హుజురాబాద్ ఉపఎన్నికను టీఆర్‌ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈటల ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ అసెంబ్లీకి త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్నట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement