Saturday, April 13, 2024

50వేల ఉద్యోగాల భ‌ర్తీకి రంగం సిద్ధంః మంత్రి ఎర్ర‌బెల్లి.

జనగామ : ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఎనభై శాతం హామీలను నెరవేర్చాం. మిగతావి రాబోయే మూడేండ్లలో పూర్తి చేస్తామని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ. ఇప్పటి వరకు లక్షా ముఫ్పై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. మరో యాభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం చేశామని తెలిపారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. కేంద్రం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా అందులో ఒక్క‌టి కూడా రాష్ట్రానికి కేటాయించ‌లేద‌ని మండిప‌డ్డారు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చికూతలు కూస్తున్నర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులను కేంద్రం మోసం చేస్తున్నది. రైతులు ధర్నా చేస్తే బీజేపీ స్పందించడం లేదన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్లను కోరుతున్న. పల్లా రాజేశ్వర్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ మీడియా స‌మ‌వేశంలో శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చైర్మన్‌ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జామున, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement