Thursday, April 18, 2024

ముగిసిన ఈడి సోదాలు, 10 గంట‌ల‌పాటు త‌నిఖీలు.. ఈడీకి ఏం సంబంధం అన్న మంత్రి గంగుల

కరీంనగర్లో కలకలం సృష్టించిన ఈడి సోదాలు ముగిసాయి. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈడి, ఐటి సోదాలు రాత్రి 8:30 గంటలకు కంప్లీట్ అయ్యాయి. గ్రానైట్ వ్యాపారుల కార్యాలయాలతో పాటు వారి ఇండ్ల‌ల్లో 10 గంటల పాటు అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ ఇంటితోపాటు ఆయ‌న కుటుంబ సభ్యుల ఇండ్ల‌ల్లో కూడాఈ తనిఖీలు నిర్వహించారు.

కాగా, ఈ అంశంపై మంత్రి గంగుల కమలాకర్​ స్పందించారు. దుబాయ్​ పర్యటనలో ఉన్న ఆయన తిరిగి తెలంగాణకు వచ్చారు. అయితే.. తాను వీడియో కాల్​లో ఉండి, ఇంట్లోని అన్ని లాక్​లను ఓపెన్​ చేయించినట్టు గంగుల తెలిపారు. అయినా.. ఇది తెలంగాణ ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశమని, దీనికి ఈడీకి ఏం సంబంధమో తెలియడం లేదని మంత్ర గంగుల వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement