Friday, April 19, 2024

ఎల్ల‌మ్మ ఆశీస్సుల‌తో సంతోషంగా ఉండాలి : మంత్రి త‌ల‌సాని

బల్కంపేట ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్ల ఆశీస్సులతో నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా పాడి పంటలు, సుఖ సంతోషాలతో జీవించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరంను పురస్కరించుకుని బల్కంపేట ఎల్లమ్మ, మహంకాళి అమ్మవారి ఆలయాల ఈఓలు అన్నపూర్ణ, మనోహర్ రెడ్డిల ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ దంపతులను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. జీహెచ్ఎంసీ జోనల్ రవి కిరణ్, ఈఈ సుదర్శన్, మహంకాళి ఏసీపీ రమేష్, పలువురు ఎస్ఐ లు మంత్రిని వెస్ట్ మారెడ్ పల్లిలోని నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మీ, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రికి బొకే లను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement