Friday, April 19, 2024

అక్ర‌మ క‌ట్ట‌డాల తొల‌గింపు – ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు

పెద్దపెల్లి : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై దుకాణాదారులు ఆక్ర‌మించిన వాటిని తొలగించారు. రోడ్డు పై వరకు ఉన్న షెడ్లు, సామాగ్రిని మున్సిపల్ సిబ్బందితో కలిసి తొలగించారు. అనంతరం పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ రాజీవ్ రహదారిపై తీవ్రమైన రద్దీ ఉందని, దుకాణాదారుల ఆక్రమణల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయ న్నారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ లో భాగంగా ఆక్రమణలను తొలగించామని, మొదటిసారిగా హెచ్చరించి వదిలేస్తున్నామని మరోసారి ఇలా జరిగితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లో టి ఐ ప్రదీప్ కుమార్ ఎస్ఐలు రాజేష్, రాజ వర్ధన్, మౌనిక, దత్తుప్రసాద్ తో పాటు మున్సిపల్ అధికారి అభినవ్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement