Tuesday, April 16, 2024

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కు ఈసీ షాక్.. మూడేళ్లపాటు వేటు!

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి బలరాం నాయక్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. మూడేళ్లపాటు చట్ట సభల్లో పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేసిన ఆయన ఎన్నికల ఖర్చుల వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించలేకపోయారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మూడేళ్లపాటు చట్టసభలకు పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

కాగా, బలరాం నాయక్ 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. . 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

ఇది కూడా చదవండి: నీటి యుద్ధం అంటూ కేసీఆర్ మరో డ్రామా: భట్టి విక్రమార్క

Advertisement

తాజా వార్తలు

Advertisement