Thursday, April 25, 2024

స‌న‌త్ న‌గ‌ర్ ను ఆద‌ర్శ‌వంతంగా తీర్చిదిద్దేందుకు కృషి : మంత్రి త‌ల‌సాని

అభివృద్ధిలో సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన హైదరాబాద్ జిల్లా హాకర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు సోమవారం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్ అహ్మద్, రెబ్బన రామారావుల ఆధ్వర్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. హాకర్స్ కు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో నూతన కమిటీ అద్యక్షులు ఆకుల హరిక్రిష్ణ, వైస్ ప్రెసిడెంట్ లు దేశాపాక గోవర్ధన్, మొహ్మద్ ఆల్తాఫ్, బషీర్, హుస్సేన్, జనరల్ సెక్రెటరీ మేకల అశోక్, తదితరులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement