Friday, March 29, 2024

ఏడుపాయల ఆలయానికి రూ.100 కోట్లు: మంత్రి హరీష్ రావు

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏడుపాయల దుర్గామాత జాతరను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని చెప్పారు. ఏడుపాయల కు 100 కోట్ల రూపాయలు కేటాయించారని వెల్లడించారు. రూ.100 కోట్లతో ఏడుపాయల ఆలయం వద్ద ఫౌంటెన్స్ , క్వార్ట్జ్ లు ,ఇతర అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సింగూర్ కు లింక్ చేయడం వల్ల ఏడుపాయల వద్ద నిరంతరం నీళ్లు ఉంటాయని మంత్రి హరీష్ చెప్పారు. గతంలో ఏడుపాయల వద్ద నీళ్ళ కోసం అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కృషితో సింగూర్ కు నీళ్లు వస్తున్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రారంభించిన్నప్పుడు పనులు కానేకావు అని హేళన చేశారని మండిపడ్డారు. మల్లన్నసాగర్  అంటే జల ప్రవాహిని అని అన్నారు. మల్లన్నసాగర్ నీళ్ల తో మెదక్ జిల్లా ను సస్యశ్యామలం చేస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement