Thursday, April 25, 2024

Education: యోగాపై డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్‌.. ఓయూలో స‌రికొత్త కోర్సులు..

ఉస్మానియా యూనివ‌ర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ ద్వారా కొత్త కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. సమాజానికి అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దడంపై ఓయూ దృష్టి పెట్టింది. కరోనా నేపథ్యంలో ప్రజల్లో వ్యాయామం, యోగా, మెడిటేషన్‌, డైటింగ్‌ వంటి పలు అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో యోగాకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడగా దీనికి అనుగుణంగా దూరవిద్యా విధానం ద్వారా ఆ కోర్సును అందించబోతున్నారు. దీనికి కావాల్సిన ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డారు యూనివర్సిటీ అధికారులు. వీడియో పాఠాలు, టెస్ట్ బుక్స్‌, సిలబస్‌ తయారు చేయించేందుకు నిపుణులతో యూనివర్సిటీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement