Wednesday, March 27, 2024

హైదరాబాద్ లో లగ్జరీ కార్లపై ఈడీ ఫోకస్

ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ నగరంలో లగ్జరీ కార్లపై ప్రత్యేక దృష్టి సారించింది. బినామీ పేర్లతో కార్లను కొనుగోలు చేసినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే టాక్స్ చెల్లించని వ్యాపారులను ఈడీ విచారించనున్న‌ట్లు తెలుస్తోంది. లగ్జరీ కార్లు కొనుగోలు చేసి పన్నులు ఎగ్గొట్టినట్లు ఈడీ గుర్తించిందని సమాచారం. ఇందులో భాగంగానే ప‌లువురికి ఈడీ నోటీసులు అందజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement