Wednesday, April 24, 2024

సింగ‌రేణిలో ప్ర‌మాదం : కార్మికుడు మృతి

సింగరేణిలో ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీంతో కార్మికులు భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవం రోజైన ఇవాళ‌ మరో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. రామ‌గుండం ప‌రిధిలోని సింగ‌రేణి ఆర్జీ 3లోని ఓసీపీ-1లో ఈ రోజు ఉద‌యం ప్రమాదం జ‌రిగింది. డంప‌ర్‌ను మ‌రో డంప‌ర్ ఢీకొట్టిన ప్రమాదంలో.. ఆప‌రేట‌ర్ శ్రీనివాస్ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన స‌మాచారం అందుకున్న సింగ‌రేణి అధికారులు.. అక్కడికి వెళ్లి ప‌రిస్థితిని స‌మీక్షించారు. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ చనిపోవ‌డంతో ఆ కుటుంబంలో విషాదఛాయ‌లు అలుముకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement