Thursday, April 25, 2024

నిద్రమత్తులో డ్రైవర్.. రోడ్డుపక్కకు దూసుకెళ్లిన డీసీఎం..

దేవరుప్పుల (ప్రభ న్యూస్): జనగామ జిల్లాలో ఇవ్వాల యాక్సిడెంట్ జరిగింది. మన్ పహాడ్ గ్రామ సమీపంలో జనగామ-సూర్యాపేట ప్రధాన రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తులో జారుకోగా డీసీఎం అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దీంతో రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో రెయిలింగ్ మొత్తం విరిగిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు, క్లినర్ కు ఎలాంటి ప్రమాదం జ‌ర‌గ‌లేదు. విషయం తెలుసుకున్న ఎస్సై.రాజు ఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement