Wednesday, April 24, 2024

తెలంగాణలో వచ్చేది డబులింజన్ సర్కారే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం రెడీ: ల‌క్ష్మ‌ణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో రానున్నది డబులింజన్ సర్కారేనని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు డా. లక్ష్మణ్ అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు బాసటగా నిలిచేది బీజేపీ ఒక్కటేనని ఆయనన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం నిధులిస్తుంటే, రాష్ట్రాలు సొమ్మొకరిది – సోకు ఒకరిదన్నట్టు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

రాష్ట్రాలు దళారి పాత్ర పోషిస్తూ పథకాలను కాజేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో ప్రగతి భవన్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని అన్నారు. ఈ నెల 14న అమిత్ షా తెలంగాణకు వస్తున్నారని, ఓ భారీ బహిరంగ సభలో పాల్గొంటారని డా. లక్ష్మణ్ తెలిపారు. పాలమూరు జిల్లా గురించి మాట్లాడే హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement