Friday, March 29, 2024

Dornakal : గ్రంథాలయం అద్భుతం.. మంత్రి కేటీఆర్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిధులు లేక కూనరిల్లిన గ్రంధాలయాలకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మహర్దశ సంతరించుకుంది. జిల్లా గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆధ్వర్యంలో డోర్నకల్ గ్రంథాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.ఈ గ్రంథాలయానికి రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి ప్రశంసలు కురిపించారు. నాడు.. నేడు అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు. డోర్నకల్ గ్రంథాలయాం అద్భుతంగా ఉందంటూ ప్రశంసించిన మంత్రి కేటీఆర్ కు గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement