Friday, April 26, 2024

Tealangana: 48 గంటలపాటు ఏ మీటింగ్​ పెట్టొద్దు.. మంత్రి జగదీశ్‌రెడ్డిపై ఈసీ ఆంక్షలు

మంత్రి జగదీశ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించింది. 48గంటల పాటు ర్యాలీలు, సభలు, సమావేశాలకు హాజరుకావొద్దని ఇవ్వాల (శనివారం) ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా మీడియాతో ఊడా మాట్లాడొద్దని.. ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఆదేశించింది. ఈ సాయంత్రం నుంచే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ఈసీ పేర్కొంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్​ఎస్​కు ఓటు వేయకుంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని జగదీశ్‌రెడ్డి అన్నారని బీజేపీ చేసిన ఫిర్యాదు చేయగా.. తొలుత మంత్రి నుంచి వివరణ కోరింది ఎలక్షన్​ కమిషన్​.

కాగా, ఇవ్వాల మంత్రి జగదీశ్​రెడ్డి ఇచ్చిన వివరణ సహేతుకంగా లేదన్న కారణంతో ఈసీ ఇట్లాంటి యాక్షన్​ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం మునుగోడులో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈసీ ఆదేశాల మేరకు జిల్లా మంత్రిగా జగదీశ్‌రెడ్డి ఈ సభకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement