Thursday, April 25, 2024

వ్యాక్సినేష‌న్ పై భ‌యం వ‌ద్దు.. అంద‌రు మొదటి, రెండు డోసులు తీసుకోవాలీ : అసదుద్దీన్‌

ప్రభ న్యూస్‌ : కోవిడ్‌ టీకా విషయంలో అపోహలు వీడనాడి వెంటనే వ్యాక్సిన్‌ తీసుకోవాలని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు. పాతనగరం సంతోష్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని కాలంధర్‌ నగర్‌లో సామాజిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతబస్తీలో కొవిడ్‌ టీకా తీసుకోని వారిశాతం అధికంగా ఉందని వైద్యారోగ్యశాఖ లెక్కలు చూపుతున్నాయన్నారు. అందువ్లల ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభ సమయంలోనే తామంతా(ఎంఐఎం పార్టీ బాధ్యులు) మొదటి, రెండు డోసులు తీసుకున్నామని ఈ సందర్భంగా స్పష్టంచేశారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ అధికారులు ఇంటింటికీ తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తున్నారని తెలిపారు. ​అందువల్ల సంబంధిత అధికారులకు తప్పనిసరిగా సమాచారమివ్వాలని ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మొదటి డోసు తీసుకున్న తర్వాత ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వచ్చి రెండో డోస్‌ కోసం సమాచారం కూడా సేకరిస్తున్నారని, అందువల్ల అధికారు లకు స్థానికులు సహకరించా లని ఆయన స్పష్ట ం చేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖా ద్రి, జోనల్‌ కమిషనర్‌ సామ్రాట్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జే.వెంకటితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement