Wednesday, April 24, 2024

జగిత్యాలలో జాలరుకు చిక్కిన అరుదైన దెయ్యం చేప..

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో ఓ అరుదైన చేప వలకు చిక్కింది. చేపలు పట్టడానికి వెళ్లిన జాలరు గొల్లపెళ్లి రాజనర్సు కు అరుదైన వింత చేప తన వలలో పడింది. ఈ విషయాన్ని జిల్లా మత్య్సశాఖ అధికారులకు తెలుపగా, దీనిని డెవిల్( దెయ్యపు ) చేప అంటారని, ఇది ఎక్కువుగా సముద్రంలో ఉంటాయని, మన తెలంగాణలోని వాగులో దొరకడం చాలా అరుదు అని తెలియజేశారు.

కాగా ఈ రకపు డెవిల్ ఫిష్ పై నల్లటి మచ్చలు, ముళ్లు ఉంటాయి. సుమారు అరకేజీకి పైగానే బరువు ఉంది. తాను ఎన్నో ఏండ్ల నుంచి చేపలు పడుతున్న కాని ఇలాంటి చేప ఎప్పుడు చూడలేదని రాజనర్సు తెలిపాడు. ఒంటినిండా జీబ్రా టైపు గీతలతో..ఈ చేపలో తినేందుకు మాంసం ఉండదు. పైగా చేప నిండా ముళ్లు, చర్మ కప్పబడినట్టు ఉంటుంది. సముద్రజాతికి చెందిన ఈ చేప నోరు అడుగు భాగంలో ఉంటుంది. చర్మం అంతా దుప్పటి కప్పబడినట్టు కన్పిస్తుంది. ఈ చేప ఉన్నచోట వేరే చేపలు బతకడం కష్టమని.. తన చుట్టూ ఉన్న మత్స్యాలను ఇది ఆహారంగా తీసుకుంటుందన్నారు. డెవిల్‌ ఫిష్‌కు పదునైన దంతాలు ఉండటం వల్ల వలలను సైతం కొరికి వేస్తుందని మత్య్సశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఆర్ఆర్ఆర్: ఐడీ కార్డు ధరించిన ఎన్టీఆర్, జక్కన్న..

- Advertisement -


.

పలు పడుతుండగా డెవిల్ ఫిష్ వలలో పడింది. పొలుసులు లేకుండా బంగారు వర్ణం కలిగి నల్లటి గీతలతో ఆకర్షణీయంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement