Thursday, April 25, 2024

దిశ కేసు: విచారణకు హాజరైన సజ్జనార్

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసులో సైబరాబాద్ మాజీ సీపీ సజ్జనార్ వరుసగా రెండవరోజు  హైపవర్  కమిషన్ ముందు హాజరయ్యారు. దిశ ఘటన పరిణామాల తరువాత ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై కమిషన్ విచారణ చేయనుంది. ఇప్పటికే సిట్ ఇంచార్జ్ మహేష్ భగవత్, హోం శాఖ సెక్రెటరీ, బాధిత కుటంబాలు, ప్రత్యక్ష సాక్షులు, డాక్టర్స్, ఫోరెన్సిక్ నిపుణులు, రెవిన్యూ అధికారులను కమిషన్ విచారించింది. ఈ కేసులో సజ్జనార్ స్టేట్మెంట్ కీలకం కానుంది. విచారణ అనంతరం సుప్రీంకోర్టుకు కమిషన్ నివేదిక సమర్పించనుంది. కాగా, ప్రస్తుతం సజ్జనార్ ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ సమయంలో సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: India Corona: దేశంలో రికార్డు స్థాయిలో తగ్గిన కరోనా

Advertisement

తాజా వార్తలు

Advertisement