Friday, April 19, 2024

ఉమేష్‌ చంద్రకు డీజీపీ అంజనీకుమార్ నివాళి

తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర విగ్రహానికి నివాళులర్పించారు. ఉమేష్ చంద్ర జయంతి పురస్కరించుకుని బుధవారం ఎస్.ఆర్.నగర్ కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి డీజీపీ అంజనీ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన బ్యాచ్‌మేట్‌ ఉమేష్ చంద్రతో ఉన్న అనుబంధాన్ని ఉమేష్‌ తండ్రితో కలిసి గుర్తు చేసుకున్నారు. తానూ, ఉమేష్ చంద్ర ఇద్దరం ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసిస్టెంట్ ఎస్.పీ గా తమ కెరీర్ లను ప్రారంభించామని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement