Wednesday, April 24, 2024

త‌న హ‌యాంలోనే అభివృద్ధి : శ్రీశైలం గౌడ్

సుభాష్ న‌గ‌ర్ త‌న హయాంలోనే అభివృద్ధి జరిగిందని.. తెరాస పార్టీ వచ్చాక ఈ కాలనీకి చేసిందేమీ లేదని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. సుభాష్ నగర్ డివిజన్ డీపీ కాలనీకి వివిధ పార్టీలకు చెందిన నాయకులు భారతీయ జనతా పార్టీలో కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో చేరారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పార్టీలో చేరిన నాయకులకు అండగా ఉంటానని కూన శ్రీశైలం గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కంది శ్రీరాములు, సీనియర్ నాయకులు ఎంఎస్ వాసు, ఇన్‌చార్జ్ గరిగే శేఖర్ ముదిరాజ్, గుబ్బల లక్ష్మీనారాయణ పార్టీలో చేరిన నాయకులు జి.కుమార్, కాలనీ మాజీ అధ్యక్షుడు పటేల్ రాజేందర్, సత్తి శ్రీనివాస్, భీమ్ రావ్, పటేల్ అబ్బు, వి.సాయికుమార్, మహేందర్ రెడ్డి, మహేష్, జి.రఘు, సాయి గణేష్, రవి కుమార్, ఆదిత్య, వి.సాయి, జి.వేణు మంగమ్మ, పద్మావతి, కనక లక్ష్మి, పలువురు మహిళలు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement