Friday, April 19, 2024

విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ లు పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్

నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని రాజధాని స్కూల్ లో రేపు జరగపోయే ఇంటర్ స్కూల్ ఖోఖో టౌర్నమెంట్ లో పాల్గొననున్న ఎస్.ఆర్.డిజి స్కూల్ విద్యార్థులకు ఈ రోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ టి షర్ట్స్, షార్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థులకు చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని వాటితో విద్యార్థులకు మానసిక శాంతికి దోహదపడుతుందన్నారు. విద్యార్థులకు సరైన శిక్షణ తరగతులను నిర్వహించాలని పాఠశాల ఉపాద్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎమ్ సీ సంయుక్త కార్యదర్శి కుమార్ రెడ్డి, ఎన్ ఎమ్ సీ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు రవి కుమార్, ఎస్.ఆర్. డిజి స్కూల్ పీటీ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement