Friday, March 29, 2024

వరంగల్ జిల్లా వ్యాప్తంగా – రైతుల ముందస్తు అరెస్ట్ లు

ల్యాండ్ పూలింగ్ జీఓ 80A ను శాశ్వతంగా ప్రభుత్వమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. నేడు జాతీయ రహదారి దిగ్బంధనికి పిలుపునిచ్చారు రైతులు. రైతుల నిరసనను భగ్నం చేయడానికి ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఉదయం నుండి రైతులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పోలీసులు. ఐనవోలు, జాఫర్గడ్, ధర్మసాగర్ మండలలో కొనసాగుతున్న రైతుల అరెస్టుల పరంపర కొన‌సాగుతోంది.. ప్రజాస్వామ్య దేశంలో రైతులు రాజ్యాంగ బద్దంగా నిరసన తెలియజేయకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement