Thursday, March 28, 2024

డిగ్రీ కాలేజీలో అడ్మిషన్స్ గడువు పొడిగింపు..

తెలంగాణలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు గడువు మరోసారి పెంచింది విద్యాశాఖ.. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ‘దోస్త్’ మొదటి విడత రిజిస్ట్రేషన్ గడువు నిన్నటితో ముగిసింది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోవడంతో గడువును మరోమారు పొడిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి వరకు 1.88 లక్షల మంది విద్యార్థులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వచ్చే నెల 4న తొలి విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆ తర్వాతి రోజు నుంచి 9 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆగస్టు 5 నుంచి 18 వరకు జరుగుతుంది. అదే నెల 25న రెండో విడత సీట్లను కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల 28 వరకు పొడిగించినట్టు దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్. లింబాద్రి తెలిపారు.

ఇది కూడా చదవండి : ఈటల చాలా చిన్నోడు.. ఆయనతో అయ్యేది లేదుః సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement