Tuesday, April 23, 2024

త‌ల్లీ కొడుకుల ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టు

కామారెడ్డి (ప్రభ న్యూస్): కామారెడ్డి మహారాజ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న రామాయంపేట వ్యాపారి సంతోష్ అతని తల్లి పద్మ ఆత్మహత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన‌ట్టు కామారెడ్డి టౌన్ పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఏడుగురు నిందితులపై కామారెడ్డి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడుగురులో ఆరుగురిని పట్టుకున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించారు.

రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి, తోట కిరణ్ కన్నపురం కృష్ణ గౌడ్ , పృథ్వి రాజ్ గౌడ్ , రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొడుకును పట్టుకున్నట్లు టౌన్ పోలీసులు తెలిపారు. ఆత్మహత్య కేసులో ఏ _7 నిందితుడైన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జున్ గౌడ్ విష‌యాన్ని మాత్రం పోలీసు తెలపలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement