Friday, March 15, 2024

celebrations : దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం.. బాల్క సుమన్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను మంచిర్యాల జిల్లాలో అత్యంత ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా, నస్పూర్ లోని సీసీసీ గెస్ట్ హౌస్ లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, జూన్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సంబంధించి జిల్లాస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన బాల్క సుమన్ మాట్లాడుతూ… దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొననున్నారని తెలిపారు. ఇందుకుగాను జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తుందన్నారు. జూన్ 9వ తేదీన మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్, భారత రాష్ట్ర సమితి కార్యాలయం భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్, దుర్గం చిన్నయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ప్రజా ప్రతినిధులు, జిల్లాస్థాయి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement