Thursday, April 18, 2024

సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలి: ప్రభుత్వ చీఫ్ విప్

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతీ ఒక్కరు సైన్స్ పట్ల అవగాహన పెంచుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని శ్రీనివాస్ గురుకుల్ లో  రూ. 12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ను వినయ్ భాస్కర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో ఇంత మంచి ల్యాబ్ ను ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్ధులు సైన్స్ ల్యాబ్ ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. స్థానిక కార్పొరేటర్ రావుల కోమల కిషన్ మాట్లాడుతూ సైన్స్ పితామహుడు సివి రామన్ పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో  సైన్స్ ల్యాబ్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు సివి రామన్ ను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎక్స్ బిట్లను తిలకించి విద్యార్థులను వినయ భాస్కర్ పాఠశాల యాజమాన్యం అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement