Saturday, April 20, 2024

కాక రేపుతున్న మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు

డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన దమ్మాయిగూడ వైపు వెళ్లిపోయిందంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే స్థానిక ప్రజలు, కాంగ్రెస్ నేతలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్లారెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డిపై మరోసారి కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. డంపింగ్ యార్డ్ తరలిస్తామని మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని  దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు సురకంటి శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. డంపింగ్ యార్డ్ గురించి పార్లమెంటులో లేవనెత్తిన పీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి డంపింగ్ యార్డ్ గురించి చేసిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల ముందు తను గెలిస్తే డంపింగ్ యార్డ్ తరలింపునకు కృషి చేస్తానని చెప్పి.. ఇప్పుడు మాట తప్పరని ధ్వజమెత్తారు. అన్ని పార్టీలు సహకరిస్తే డంపింగ్ యార్డ్ ను ఇక్కడ నుంచి తరలించి బావి తరాలకు మేలు చేసిన వాళ్ళం అవుతామని తెలిపారు.

కాగా, ఇటీవల జవహార్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు డంపింగ్ యార్డ్ దుర్వాసన జవహార్ నగర్ కి రావడం లేదు, దమ్మాయిగూడ వైపు వెళ్లింది అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఇది కూడా చదవండి: మాపై జోకులా?: మంత్రి మల్లారెడ్డిపై దమ్మాయిగూడ ప్రజల ఆగ్రహం

Advertisement

తాజా వార్తలు

Advertisement