Thursday, April 25, 2024

దళిత బిడ్డ వసంతకు డాక్టరేట్

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామానికి చెందిన దళిత బిడ్డ కందుల వసంతకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ లభించింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఎన్విరాన్మెంటల్ సైన్స్ (పర్యావరణ శాస్త్రం) విభాగంలో ప్రొఫెసర్ సి.వెంకటేశ్వర్ పర్యవేక్షణలో ‘ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రీటెడ్ అన్ ట్రీటెడ్ హుస్సేన్ సాగర్ వాటర్ అండ్ బోర్ వాటర్ ఆన్ లేబియో రోహిత’ అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి గ్రంధాన్ని సమర్పించింది.

వసంత విద్యాభ్యాసం పెంచికల్ దిన్నె గ్రామంలో ఇంటర్, డిగ్రీ మిర్యాలగూడాలో పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ లోని జె.ఎన్.టి.యు క్యాంపస్ లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ (పర్యావరణ శాస్త్రం) విభాగంలో ఎమ్మెస్సీ పూర్తిచేసింది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగంలో పిహెచ్ డి పూర్తి చేసింది. ఉన్నతమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పొందినందుకు పెంచికల్ దిన్నె లో ని స్నేహితులతో పాటు గ్రామ పెద్దలు పలువురు అభినందనలు తెలిపారు. కాగా, వసంత భర్త కందుల శ్రీను హైదరాబాద్ లో సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement