Wednesday, April 24, 2024

డబిల్ పూర్ ఇస్కాన్ టెంపుల్ ను దర్శించుకున్న.. గవర్నర్ తమిళ్ సై

మేడ్చల్ ప్రభన్యూస్ : డబిల్ పూర్ గ్రామ సమీపం లోని ఇస్కాన్ టెంపుల్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళ్ సై దర్శించుకున్నారు. ఆదివారం ఇస్కాన్ టెంపుల్ లో నిర్వహిస్తున్న శ్రీ మహా సుదర్శన హోమం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ డాక్టర్ తమిళ్ సైని ఆలయ నిర్వహకులు ఆహ్వానించారు.అనంతరం ఆలయంలో గవర్నర్ కు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎంపీపీ వీర్లపల్లి రజిత రాజమల్లారెడ్డి.జెడ్పిటిసి అమ్మగారి శైలజ విజయేందర్ రెడ్డి.గ్రామ సర్పంచ్ వీర్లపల్లి గీత భాగ్యరెడ్డి.మాజీ జెడ్పిటిసి శైలజ హరినాథ్ ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement