Tuesday, March 26, 2024

Crime: శాడిస్ట్.. భార్యను ప‌లు ర‌కాలుగా వేధిస్తున్న భ‌ర్త‌

భార్యను పలు రకాలుగా వేధిస్తున్న శాడిస్టు భర్తపై హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన మహిళ రహమత్‌నగర్‌లో ఉంటోంది. 2016లో ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె గర్భం దాల్చగా అబార్షన్ చేయించారు.

ఇక అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఇంటిల్లిపాదీ ఆమెను కులం పేరుతో వేధించడం మొదలుపెట్టారు. పెట్రోలు పోసి తగలబెట్టేస్తామని పలుమార్లు బెదిరించారు. దీంతో భర్తకు 1.50 లక్షలు క‌ట్నంగా ఇచ్చింది. అయినప్పటికీ భర్త ఆమెను మరింతగా వేధించడం మొదలుపెట్టాడు. అర్ధనగ్నంగా కూర్చోవాలని, మూత్రం తాగాలని బలవంతం చేసేవాడు.

అతడి వేధింపులు రోజురోజుకు మరింతగా మితిమీరుతుండడంతో భరించలేని ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement