Friday, March 29, 2024

Crime: సూర్యాపేట జిల్లాల్లో రేషన్ బియ్యం దందా.. మిల్లులో 300 క్వింటాళ్లు పట్టుకున్న పోలీసులు

అక్రమార్కులపై పోలీసులు ఎన్నిసార్లు కొరడా జులిపిన వారి తీరు మారడం లేదు. ప్రధానంగా సూర్యాపేట‌ జిల్లాలోని హుజూర్ నగర్ నియోజక వర్గం అక్రమ వ్యాపారులకు అడ్డాగా మారిపోయింది. మద్యం, గంజాయి, గుట్కా, ఇసుక, మట్టి ఇలా అన్ని అక్రమ వ్యాపారాలకు నిలయంగా మారింది.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం మఠంపల్లి మండలం అల్లిపురంలో రాధిక రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన‌ 300 క్వింటాళ్ల‌ రేషన్ బియ్యాన్ని నిన్న రాత్రి పోలీసులు పట్టుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement