Thursday, March 28, 2024

తెలంగాణలో కొత్తగా 1,280 మందికి కరోనా

తెలంగాణలో కరోనా తగ్గింది. గడచిన 24 గంటల్లో 91,621 కరోనా పరీక్షలు నిర్వహించగా… 1,280 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైరస్ కారణంగా 15 మంది మృతి చెందారు. అదే సమయంలో 2,261 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,03,369 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 5,78,748 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 3,484కి చేరింది. ఇక, గడిచిన 24 గంట్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 165 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 156 కేసులు నమోదు అయ్యాయి. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 1 కేసు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement