Tuesday, March 26, 2024

ప్రమాదకర స్థాయిలోనే కరోనా వ్యాప్తి.. తాజాగా 1,061 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య మరోసారి వెయ్యి దాటింది. గడచిన 24 గంటల్లో 43,318 కరోనా పరీక్షలు నిర్వహించగా… 1,061 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 401 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 63, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56, నల్గొండ జిల్లాలో 51, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 46, కరీంనగర్ జిల్లాలో 43 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 836 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,23,724 మంది కరోనా బారినపడగా, వారిలో 8,13,256 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,357 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement