Thursday, April 25, 2024

సూర్యాపేటలో క‌రోనా కలకలం.. డీఎంహెచ్ఓ ఫ్యామిలీలో ఆరుగురికి పాజిటివ్‌..

సూర్యాపేటలో డీఎంహెచ్​వో కోటా చలంతో పాటు ఆయన కుటుంబంలో ఆరుగురికి కరోనా పాజిటివ్​గా తేలింది. బుధవారం కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్న డీఎంహెచ్‌వో కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ముందు డీఎంహెచ్‌వో భార్య, కుమారుడు, కోడలుకు పాజిటివ్​గా తేలింది. శుక్రవారం కొవిడ్‌ పరీక్ష చేయించుకున్న కోటాచలంకు కరోనా​ సోకినట్టు తేలింది. డీఎంహెచ్‌వో కుమారుడు 5 రోజుల క్రితమే జర్మనీ నుంచి వచ్చాడు. కాగా, ఆయన కుటుంబం రెండ్రోజుల క్రితం తిరుపతి వెళ్లి రావటం ఇప్పుడు మరింత ఆందోళ కలిగిస్తోంది. మరోవైపు డీఎంహెచ్​వో కోటాచలం.. నిన్న ఎయిడ్స్​డే కార్యక్రమంలో పాల్గొని… వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించారు. ఆయనకి కరోనా పాజిటివ్​గా తేలటంతో నిన్న ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఆందోళన నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement